Saturday, April 27, 2024

వింబుల్డన్​ మిక్స్‌డ్‌ డబుల్స్‌.. సెమీస్‌కు సానియా జోడీ

వింబుల్డన్‌:వింబుల్డన్‌లో భారత క్రీడాకారిణి సానియా మీర్జా మెరుగైన ఆటతీరును ప్రదర్శించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో క్రొయేషియాకు చెందిన మేట్‌ పావిక్‌తో కలసి సెమీస్‌కు దూసుకెళ్లారు. ఈ విభాగంలో సెమీస్‌కు వెళ్లడం ఈ జోడీకి ఇదే ప్రథమం. నాలుగో సీడ్‌ క్రీడాకారిణి గాబ్రియేలా డబ్రోవిస్కీ, జాన్‌ పీర్స్‌ జోడీపై 6 వ సీడ్‌ సానియా జోడీ విజయం సాధించింది. మూడో కోర్టులో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సెమీస్‌కు దూసుకెళ్లారు.

గాబ్రియేల, పీర్స్‌తోతలపడిన సానియాస పావిక్‌ జోడీ 6-4, 3-6, 7-5 సెట్లతో విజయం సాధించింది. గంటా నలభై నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌ అందరినీ ఆకట్టుకుంది. 2022 సీజన్‌ తనకు చివరి వింబుల్డన్‌ అని ముందే ప్రకటించిన సానియా ఉత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. రోబర్ట్‌, జెలెనా జోడీతో నీల్‌ స్కుప్సీ, డెసిరాయ్‌ క్రావ్‌జిక్‌తో జరిగిన చివరి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నెగ్గిన జోడీతో సానియా జోడీ సెమీస్‌లో తలపడనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement