Sunday, May 5, 2024

NZB: గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే తో మాట్లాడి నిధులు ఇప్పిస్తా.. ఎంపీ ధర్మపురి

గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యేతో మాట్లాడి నిధులు ఇప్పిస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని అందాపూర్ గ్రామంలో వికసిత్ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. గ్రామ అభివృద్ధికి నిధులు ఇప్పటివరకు ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ నాయకులు, ప్రస్తుత సర్పంచ్ భర్త సుదర్శన్ కార్యక్రమంలో ప్రశ్నించారు. ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు వికసత్ భారత్ ద్వారా మహిళా సంఘాలకు కేటాయిస్తున్న నిధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీ తెలిపారు.

గ్రామాల అభివృద్ధికి నిధులు అడగడం మంచి పరిణామం మీ గ్రామానికి నిధులు కావాలని తమ దృష్టికి ఎప్పుడైనా తీసుకువచ్చారా అని ఎంపీ సూటిగా ప్రశ్నించారు. పదేళ్లపాటు పాలన చేసి బోధన్ నియోజకవర్గం వెనుకబాటుకు కారకులైన మీ పార్టీ, మీరు రాజకీయం చేయదలుచుకుంటే తాము మీకన్నా ఎక్కువ రాజకీయం చేయగలుగుతామని ఎంపీ అరవింద్ హెచ్చరించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడైనా మీరు తమ వద్దకు రావచ్చని.. చిన్న చిన్న పనులకు తన వద్ద ఉన్న ఎంపీ లాడ్స్ నిధులను అందిస్తానని సభలో స్పష్టంగా తెలిపారు. తమ ఇల్లు గడీలు కాదని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎవరైనా తమను సంప్రదించవచ్చని ఎంపీ హితవు పలికారు. అందాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు కావాలంటే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చెప్పి నిధులు ఇప్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. పార్టీలు వేరైనా అభివృద్ధి కోసం తాము ప్రజాప్రతినిధిని అందరితో మాట్లాడతామని సమాధానం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement