Tuesday, April 30, 2024

TS: కేబుల్ బ్రిడ్జిపై ఫోటోలు దిగుతుండగా.. కారు ఢీకొని ఇద్ద‌రు మృతి

హైద‌రాబాద్ : మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ఇవాళ తెల్ల‌వారుజామున రోడ్డు ప్రమాదం జ‌రిగింది. కేబుల్ బ్రిడ్జిపై పొటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

కారు ఢీకొన‌డంతో అనిల్ (25) అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి ఆస్పత్రిలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement