Friday, May 10, 2024

పెళ్లింట విషాదం.. రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జంట దుర్మరణం చెందింది. ఫోర్త్ బ్రిడ్జిపై బైక్ ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ రోడ్డుప్రమాదంలో అక్కడికక్కడే యువతి, యువకుడు మృతిచెందారు. మరో 15రోజుల్లో పెళ్లి కావాల్సిన జంట రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువాత పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement