Tuesday, April 30, 2024

న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కి క‌రోనా-మాస్క్ లు పెట్టుకోమ‌ని పిలుపు

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో వ‌దిలేలా లేదు.ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌జ‌లు..సెల‌బ్రిటీలు ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు.కాగా తాజాగా న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఈ మేర‌కు ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్వ‌యంగా ఆమె ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ త‌న‌కు క‌రోనా సోకింద‌ని ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, అవ‌స‌ర‌మైతే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆమె పిలుపునిచ్చారు.ఇదిలా ఉంటే… సెట్స్ లో సినీ న‌టులు త‌మ సిబ్బంది మాస్కులు ధ‌రించేలా ఇక‌నైనా ఒత్తిడి తీసుకురావాల‌ని వ‌ర‌ల‌క్ష్మి కోరారు. న‌టులుగా నిత్యం మాస్కులు పెట్టుకోవ‌డం కుద‌ర‌ద‌ని తెలిపిన ఆమె.. క‌నీసం సిబ్బంది అయినా మాస్కులు పెట్టుకుంటే క‌రోనాను నియంత్రించ‌వ‌చ్చ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. వ‌ర‌ల‌క్ష్మి పోస్ట్‌ను చూసిన వారంతా క‌రోనా నుంచి ఆమె త్వ‌ర‌గా కోలుకోవాలంటూ కోరుతూ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement