Friday, May 17, 2024

మ‌ణిపూర్ లో స్వ‌ల్ప భూకంపం

మ‌ణిపూర్ మోయిరాంగ్ కు తూర్పు-ఆగ్న‌యంలో స్వ‌ల్ప భూకంపం వ‌చ్చింది.కాగా రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప కేంద్రం లోతు 94 కి.మీ.గా ఉందని చెప్పింది.
అంతకుముందు ఈ నెల 5న అస్సాంలో రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 11:03 గంటలకు సంభవించిన భూకంపం యొక్క లోతు 35 కి.మీ. గా ఎన్సీఎస్ గుర్తించింది. దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎన్సీఎస్ భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement