Saturday, May 18, 2024

బీజేపీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్‌

బీజేపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. పోటీ నుంచి తప్పుకునేలా రెబెల్‌ అభ్యర్థులపై భాజపా ఒత్తిడి చేస్తోందని, ఇందుకు సంబంధించి తమవద్ద వీడియో క్లిప్‌ ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నామని చెప్పింది. ఫతేపూర్‌ నుంచి పోటీచేస్తున్న రెబెల్‌ అభ్యర్థి క్రిపాల్‌ పర్మార్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసేలా ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ ప్రస్తావించారు. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగకుండా ప్రధాని మోడీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీకి పరిపాలన కంటే ఎలక్షనీరింగే బాగా తెలుసునని సింఘ్వీ ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement