Friday, May 3, 2024

బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన నేత

ఏపీలో పురపాలక ఎన్నికల్లో ఓటమికి జనసేన నేతలు పోస్టుమార్టం ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఓటమికి బీజేపీనే కారణమని జనసేన నేత పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామని భావించిన స్థానాల్లోనూ ఓడిపోవడం నిరాశ కలిగించిందన్నారు. ‘మేం ఎక్కడికెళ్లినా ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు మమ్మల్ని వ్యతిరేకించారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డాం, ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం, అయినా విజయవాడలో ఎక్కడా మాకు బీజేపీ అండగా నిలబడలేదు. మా అభ్యర్థులు చేసిన తప్పేంటి’ అని నిలదీశారు. బీజేపీతో పొత్తు వల్ల జనసేన జెండా పట్టుకునే మనిషే కరువయ్యారని, ప్రజలు బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే అధిష్టానం బీజేపీతో పొత్తు కొనసాగింపు అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement