Sunday, May 5, 2024

Wanaparthy : మానవత్వం చాటుకున్న మంత్రి, ఎమ్మెల్యే

వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాల జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాట్లు ప‌రిశీలించేందుకు మంత్రి వెళ్తున్న క్రమంలో బెంగుళూరు హైవేలో వనపర్తి జిల్లా పెద్ద మందడి వద్ద బొలెరో వాహనం ప్రమాదానికి గురై బ్రిడ్జి మీదుగా కిందపడింది. తీవ్ర గాయాలైన బాధితులకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు సహాయంగా మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ నిలిచారు.

తక్షణమే అంబులెన్స్ కు, స్ధానిక పోలీస్ లతో మాట్లాడి సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డుపై తీవ్ర గాయాలైన కార్మికురాలను ధైర్యాన్ని నింపి ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటారు. అక్కడ ఉన్న వారందరూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేపట్టిన సహాయక చర్యలు పట్ల అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement