Friday, May 3, 2024

Vishaka చేరుకున్న ప‌వ‌న్ …. న‌వ‌శ‌కం బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్న జ‌న‌సేనాని

విజ‌య‌వాడ – టిడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 18న ముగిసింది. ఈ నేపథ్యంలో, నేడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద యువగళం ..న‌వ‌శ‌కం విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ విచ్చేశారు. తాజాగా, ఈ సభలో పాల్గొనేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు కదిలారు. కాసేపట్లో యువగళం-నవశకం ఈ సభ పోలిప‌ల్లిలో ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement