Thursday, May 2, 2024

Visakhapatnam : లిఫ్ట్ లో ఇరుక్కున్న మంత్రి గారు.. కంగారులో అధికారులు..

ఏపీ మంత్రి విడదల రజనీకి పెను ప్రమాదం తప్పింది. శనివారం విశాఖలో ఆమె పర్యటించారు. ఈ క్ర‌మంలో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ లో జర్నలిస్టుల కోసం వైద్య పరీక్షలు ఆమె ప్రారంభించారు. ఈ తరుణంలోనే మంత్రి విడదల రజనీ లిప్టులో చిక్కుకున్నారు. దీంతో అధికారులు కంగారు ప‌డ్డారు. రజనీతో పాటు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, తదితరులు కూడా లిప్ట్‌ లో చిక్కుకున్నారు. ఓవర్ లోడ్ కావడంతో కొద్ది నిమిషాల పాటు లిప్ట్ నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కీ ద్వారా లిప్ట్‌ను ఓపెన్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement