Friday, May 17, 2024

Khammam : పత్తి మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం.. రూ.1.25కోట్ల ఆస్తి నష్టం

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో మార్కెట్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మార్కెట్‌లో ఏర్పడిన మంటలు.. అక్కడున్న పత్తి బస్తాలకు అంటుకున్నాయి. ఈ అగ్నికీలల్లో సుమారు 1600 పత్తి బస్తాలు అగ్నికి కాలి బూడిదయ్యాయి. ఎక్కువ మొత్తంలో పత్తి బస్తాలకు మంటలు అంటుకోవడంతో.. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది.

మార్కెట్‌లో ఉన్న రైతులు, వ్యాపారులు, కూలీలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో సుమారు రూ.1.25 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement