Sunday, May 5, 2024

178 కోట్లతో దుర్గమ్మ బడ్జెట్!

విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 38 అంశాలకుగాను 36 అంశాలకు‌ ఆమోదించారు. 178 కోట్లతో ఈ ఏడాది దుర్గమ్మ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు వెల్లడించారు. విజయవాడలోని ముఖ్య కూడళ్లలో ఆర్చ్‌లు నిర్మిస్తామని తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే ఒక రైలుకు కనకదుర్గ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని కోరనున్నామని చెప్పారు. రోజుకు 5 వేల మందికి అన్నదానం చేస్తామని తెలిపారు. దుర్గమ్మ ఆలయంలో కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నామని, కరోనా వ్యాప్తి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఛైర్మన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement