Tuesday, May 7, 2024

పీఏసీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి.. వరుసగా 2వ సారి ఎన్నిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. వరుసగా రెండవ సారి పీఏసీ సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి – రాజ్యసభ లీడర్ పీయూష్ గోయల్‌కు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ ఖాతాలను పరిశీలించే కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో తాను పూర్తి నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేస్తానని వెల్లడించారు. పీఏసీ ఎన్నికల వివరాలను పార్లమెంటరీ బులెటిన్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement