Wednesday, May 15, 2024

స్మాల్ పాకెట్స్‌లో విజ‌య నెయ్యి.. రూ.10, 20కే అందుబాటులోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : వినియోగదారుల సౌలభ్యం కోసం విజయ డెయిరీ ఉత్పత్తులను తక్కువ ధరతోపాటు చిన్న ప్యాక్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విజయ డెయిరీ ఉత్పత్తిని చేసిన రూ.10, రూ. 20 ల స్పెషల్‌ గ్రేడ్‌ అగ్‌మార్క్‌ నెయ్యి ప్యాకెట్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలలో విజయ డెయిరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక నూతన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

అన్ని రకాల విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు పెద్దఎత్తున ఔట్‌లెట్‌ల ఏర్పాటుచేయటంతోపాటు ట్రై సైకిల్స్‌ ద్వారా విక్రయాలు జరుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నూతన ఉత్పత్తులు , మరిన్ని ఔట్‌లెట్‌లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాగా… పదవీ విరమణ చేయనున్న పశుసంవర్ధకశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఆధార్‌ సిన్హాను మంత్రి తలసాని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీగా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేశారని సిన్హాను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ మార్కెటింగ్‌ జీఎం మల్లిఖార్జున్‌, అధికారులు మల్లయ్య, కామేష్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement