Thursday, April 25, 2024

వాహన తనిఖీలు.. రూ.70 లక్షల నగదు పట్టివేత 

మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో భారీగా డ‌బ్బు ప‌ట్టుబ‌డుతోంది. ఇప్ప‌టికే కోట్ల రూపాయ‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వాహనంలో రూ.70 లక్షల నగదును గుర్తించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించిన రసీదు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. మునుగోడులోని ప‌లు ప్రాంతాల్లో త‌నిఖీల్లో భారీగా న‌గుదు ప‌ట్టుబ‌డింది. మునుగోడులోని నారాయణపురం మండలంలో, అంతారం గేటు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా రూ.ల‌క్ష‌ల్లో న‌గ‌దు ప‌ట్టుకున్నారు. దీంతో నగదును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement