Thursday, April 25, 2024

వారాహికి కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో.. ప్రత్యేక పూజలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీలో బస్సు యాత్రని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన వాహనం వారాహికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. వచ్చే నెల 2న ఏకాదశిని పురస్కరించుకొని.. జనసేన నేతలు వాహన పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ చేసిన తర్వాత.. ఏపీలోని బెజవాడ కనకదుర్గ ఆలయంలోనూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనాన్ని పవన్ తనకు కావాల్సినట్లుగా తయారు చేయించారు. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు రెడీ అయ్యారు. ఎన్నికలే టార్గెట్‌గా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement