Tuesday, May 14, 2024

Uttarakhand – చిరుత వేటకు మహిళ బలి

ఉత్తరాఖండ్ – : పశువులకు మేత తీసుకువచ్చేందుకు అడవికి వెళ్లిన ఓ మహిళపై చిరుతపులి దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని సుఖిధాంగ్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళను చిరుతపులి చంపింది. ఈ సంఘటన ధురా గ్రామంలో జరిగిందని, మృతురాలు చంద్రావతిగా గుర్తించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. పశువులకు మేత కోసం అడవికి వెళుతున్న కొందరు మహిళలపై చిరుతపులి దాడి చేసింది

చిరుత చంద్రావతిని ఈడ్చుకెళ్లిందని, మిగతా మహిళలు తప్పించుకుని గ్రామస్థులకు సమాచారం అందించారని అటవీశాఖ అధికారి తెలిపారు. అడవిలో చంద్రావతి కోసం అటవీశాఖ అధికారులు వెతకగా, ఆమె మృతదేహం అడవికి సమీపంలో కనిపించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement