Wednesday, May 1, 2024

AP: కృష్ణపట్నంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన

ముత్తుకూరు, అక్టోబర్ 14 (ప్రభ న్యూస్) : భారత ప్రభుత్వ మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఇవాళ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో తీర ప్రాంతమైన ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో పర్యటించారు. జల మార్గం ద్వారా పటిష్టమైన బందోబస్తుతో గ్రామానికి చేరుకున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కుర్మానాద్, జిల్లా మత్స్యశాఖ అధికారులు రావడం జరిగింది.

ఈ సందర్భంగా మత్స్యకార గ్రామమైన రాంనగర్ కు కేంద్ర మంత్రి వెళ్లి మత్స్యకారులతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులకు గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు. మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిషింగ్ జెట్టి నిర్మాణం చేపట్టాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీద మస్తాన్ రావు, అధికారులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement