Thursday, May 16, 2024

కేంద్ర మంత్రి నిర్మలకు ఎయిమ్స్‌లో చికిత్స.. కడుపులో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న నిర్మల

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కడుపులో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా చికిత్స నిమిత్తం ఏయిమ్స్‌లో చేరారు. 63 సంవత్సరాల నిర్మలా సీతారామన్‌ ఎయిమ్స్‌లోని ప్రైవేట్‌ వార్డుకు సోమవారం మధ్యాహ్నం వచ్చారు. కడుపులో వచ్చిన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జ్వరంతో బాధపడుతున్నట్లు తేలింది. అయితే ప్రస్తుతం ఆరోగ్యానికి ప్రమాదమేమి లేదని. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు.

వైద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎప్పుడూ బీజీగా ఉండే కేంద్ర మంత్రి శనివారం చెన్నైలోని ఎంజీఆర్‌ వర్శిటీ 35వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఆదివారం మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌జేయి జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి హాజరయి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement