Thursday, May 16, 2024

హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి మురుగ‌న్‌.. ఆకాశ‌వాణి హైద‌రాబాద్ సెంట‌ర్‌ సంద‌ర్శ‌న

కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డా.ఎల్.మురుగన్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇవ్వాల‌ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రాన్ని సందర్శించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రాన్ని సహాయ మంత్రి సందర్శించటం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో వివిధ విభాగాల పనితీరు గురించి ఆయ‌న సమీక్ష నిర్వహించారు.

అంతకుముందు జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డుని సందర్శించిన డా.ఎల్. మురుగన్ , ఆ సంస్థలో జరిగిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్.ఎఫ్.డి.బి కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీలించారు. స్వచ్చభారత్ అమలు తీరును కూడా మంత్రి పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement