Monday, April 29, 2024

రాజస్థాన్​లో ఘోరం.. నుపుర్ శర్మకు సపోర్ట్ చేశాడని టైలర్ హత్య

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ అనే టైలర్‌ను షాపులోనే హత్య చేశారు. నుపూర్ శర్మకు సపోర్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే అతడిని చంపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను దుండగులు ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇప్పుడు రాజస్థాన్లో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఆందోళనలను సద్దుమణిగేలా చేయడానికి పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అంతేకాకుండా ఐదు కంపెనీల రాజస్థాన్ సాయుధ కాన్‌స్టాబుల్స్తో సహా సుమారు 600 మంది సిబ్బందిని ఉదయపూర్‌కు పంపినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అయితే.. ఇక్కడి ఘటనపై ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇద్దరు నిందితులు మంగళవారం మధ్యాహ్నం ధన్ మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధితుల దుకాణానికి చేరుకున్నారని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement