Monday, April 29, 2024

Delhi: రెండు ట్రక్కులు ఢీ.. నలుగురు దుర్మరణం

రెండు ట్రక్కులు ఢీకొన్న రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఢిల్లీలోని కాంవడ్‌ యాత్రలో చోటు చేసుకుంది. ఢిల్లీలో ఓ ట్రక్కు అదుపు తప్పి డివైడర్‌ను దాటి హరిద్వార్‌ వెళుతున్న మరో ట్రక్కును ఢీకొంది. ఈ ఘటన ఢిల్లీలోని కర్నాల్‌ రోడ్డులో చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర దిల్లీలోని జీటీ కర్నాల్ మార్గంలో ఓ ట్రక్కు కాంవడ్‌ యాత్రికులను హరిద్వార్‌కు తీసుకెళుతోంది.

దీనిలో 20 మంది యాత్రికులు ఉన్నారు. ఢిల్లీలోకి వస్తున్న మరో ట్రక్కు అదుపు తప్పి దీనిని ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement