Thursday, May 2, 2024

Jammu Kashmir : ఎన్‌కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతం

జ‌మ్ముక‌శ్మీర్ లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, టెర్ర‌రిస్టుల‌కు మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు హ‌త‌మ‌య్యారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లా రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇది పసిగట్టిన టెర్రరిస్టులు.. భద్రత బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. అలర్ట్‌ అయిన ఆర్మీ.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హ‌తమ‌య్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement