Sunday, April 28, 2024

సూర్యాపేటలో రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం

సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో రెండు బస్సులు దగ్ధం అయ్యాయి. మ‌డలంలోని గంపులగ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒక బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఆ బస్సులో షార్ట్ సర్క్యూట్‎ కావడంతో మంటలు చెలరేగాయి. అయితే బస్సులో ఎవరూలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఒక బ‌స్సు సాంకేతిక లోపంతో ఆగిపోగా.. మ‌రో బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను త‌ర‌లించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. సాంకేతిక లోపంతో ఆగిపోయిన బ‌స్సు నుంచి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో ప‌క్క‌నే ఉన్న మ‌రో బ‌స్సుకు కూడా వేగంగా మంట‌లు వ్యాపించాయి. దీంతో రెండు బ‌స్సులు ద‌గ్ధ‌మ‌య్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement