Thursday, May 2, 2024

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి

వర్ని, మే 01 (ప్రభా న్యూస్): మండలంలోని శ్రీనగర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏ ఎస్సై నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం అద్దెన్ పుర్ బిలోలికి చెందిన ఇద్దరు బైక్ పై వర్ని నిజామాబాద్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో షాదుల్ మౌల(45) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో ఉన్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement