Saturday, April 20, 2024

Delhi | ప్రారంభానికి సిద్ధంగా బీఆర్ఎస్ కార్యాలయం.. భవనాన్ని పరిశీలించిన ప్రశాంత్ రెడ్డి, సంతోష్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయ భవనాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సందర్శించి, పనులను పరిశీలించారు. ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో నిర్మించిన భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం మే 4న ఈ భవనాన్ని పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రారంభించనున్నట్టు తెలిసింది. రెండ్రోజులు ముందుగానే ఆయన ఢిల్లీ చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని సమాచారం. అందుకే తుదిమెరుగులు దిద్దుకుంటున్న భవనాన్ని ప్రశాంత్ రెడ్డి, సంతోష్ కుమార్ పరిశీలించినట్టు తెలిసింది. నిర్మాణ సంస్థకు నేతలిద్దరూ కొన్ని సూచనలు చేశారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement