Monday, May 6, 2024

రెండు రైళ్లు ఢీ, 32 మంది మృతి

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దక్షిణ కైరో సమీపంలో రెండు పాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 66 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం నాలుగు బోగీలు బోల్తా పడటంతో వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు. దక్షిణ కైరోకు 460 కి.మీ దూరంలోని షోహాగ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి 36 అంబులెన్సులను తరలించి సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement