Friday, May 3, 2024

రాజన్న రాజ్యం కాదు… రామరాజ్యం కావాలి :ధర్మపురి

పసుపు రేటు గురించి అవహగన లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని మండిపడ్డారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.ఆంద్రప్రదేశ్ రైతులు కూడా నిజామాబాద్ వచ్చి పసుపు అమ్ముకొని వెళ్లారని అరవింద్ అన్నారు. ఆంద్రప్రదేశ్ లో అమ్ముకునే దానికి కంటే ఇక్కడ ఎక్కవగా లాభం వచ్చిందన్నారు. మోడీ పసుపు రైతులకు ఎంతో లాభం చేకూర్చారని తెలిపారు అరవింద్.

తెలంగాణ లో రాజన్న రాజ్యం వద్దుని… తెలంగాణ లో రామ రాజ్యం రావాలన్నారు అరవింద్. రామరాజ్యంలో రైతులకు అత్యధిక గిట్టుబాటు ధర ఇచ్చి పంటను కొంటారని ఆయన అన్నారు. రామరాజ్యంలో అవినీతి ఉండదని తెలిపారు. సచిన్ కొడుకు,కూతరు సచిన్ అంత గొప్పవాళ్ళు కావాలని లేదు… షర్మిల ఆ విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు ధర్మపురి అరవింద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement