Friday, May 17, 2024

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..

ఆంధ్ర – ఒడిస్సా సరిహద్దుల్లోని ఒడిశాలోని కొందమాల్ జిల్లా మటకుప రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తాడికొల గ్రామ సమీపాన కూంబింగ్ చేస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతోపాటు, గ్రనేడ్లతో దాడి చేశారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందగా, మరికొందరు తప్పించుకున్నారు. ఈమేరకు ఐజీ అమితాబ్ ఠాకూర్ వివరాలు వెల్లడించారు. మృతుల్లో ఒకరిని ఏసీఎం ర్యాంక్ కమలగా గుర్తించామని, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement