Saturday, May 4, 2024

COVID-19 Update | దేశంలో తగ్గిన కరోనా యాక్టివ్‌ కేసులు..!

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ త‌గ్గుతూ వ‌స్తున్నాయి.. గ‌త నెల‌లో 200-300 వ‌ర‌కు న‌మోదు కాగా.. తాజాగా దేశ వ్యాప్తంగా 249 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,74,439కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,39,558 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,228 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,653కి చేరింది. మొత్తం మీద దేశంలో క‌రోనా అదుపులోనే ఉన్న‌ట్లు వైద్యులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement