Wednesday, May 15, 2024

ఏడుపాయలలోని చెక్ డ్యామ్‌లో నీట మునిగి ఇద్దరు మృతి

మెదక్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాపన్నపేట మండల పరిధి ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. పాపన్నపేట ఎస్ఐ విజయ్ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా దుర్కి గ్రామానికి చెందిన బాకా సాయిలు (42) దుర్గామాత దర్శనానికి ఆదివారం సాయంత్రం ఏడుపాయలకు చేరుకున్నాడు. ముఖం కడుక్కోవడానికి ఏడుపాయలలోని చెక్ డ్యామ్‌లోకి దిగుతుండగా కాలుజారి నీటిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య అనిత ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, మరో ప్రమాదంలో వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం చక్రం పల్లి గ్రామానికి చెందిన ఎండీ హకీం( 32) ఘనపూర్ ఆనకట్ట సమీపాన ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఇతడికి భార్య షబానా కూతురు నిహన్ ఉన్నారు. వీరు ఇరువురు ఆదివారం అమ్మవారి దర్శనానికి వచ్చి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement