Friday, May 3, 2024

మధ్యాహ్నానికి రైతులు అకౌంట్ లో రెండు వేలు

కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో సారి గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నగదు బదిలీ చేసేందుకు సిద్ధమైంది. 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరేంద్రమోదీ దీనిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లభ్యదారులైన 12 కోట్ల మందికి పైగా రైతుల అకౌంట్లలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు నగదు జమ చేయ నున్నారు.

ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 6 వేల చొప్పున మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి వేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1.38 లక్షల కోట్లకు పైగా సొమ్మును రైతు కుటుంబాలకు బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement