Friday, April 19, 2024

వైజాగ్ లో చికిత్స తీసుకుంటున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం చిరు చికిత్స కోసం వైజాగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన షూటింగ్ కి వెళ్లేముందు డిటాక్సిడ్ అండ్ రిజునీవేనేటెడ్ అవ్వాలని అని అనుకుంటున్నారట. దాని కోసం ఆయుర్వేద చికిత్స తీసుకోనున్నారట. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో ఉన్న ఓ ప్రముఖ ఆయుర్వేదిక్ స్పా లో ఉన్నారట.

ఇంతకుముందు కూడా చిరంజీవి ఇదే ఆయుర్వేద స్పా లోవారం పాటు గడిపారు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. అయితే నిజానికి మన హీరోలు ఈ ప్రక్రియ కోసం విదేశాలకు వెళతారు. కానీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపించలేదు. ఇక చిరు కూడా అందుకే వైజాగ్ కే పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఇది పూర్తికాగానే ఆయన సెక్స్ లో అడుగుపెట్టనున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement