Thursday, May 2, 2024

విజయనగరంలో ఆక్సిజన్ కొరత.. ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఓవైపు కేసులు పెరుగుతుంటే… మరోవైపు ఆక్సిజన్ కొరత కారణంగా బాధితులు మృతి చెందుతున్నారు. విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్ ఐసోలేషన్ వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఇద్దరు మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ మహారాజా ఆస్పత్రిని సందర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో కొందరిని ప్రైవేటు అంబులెన్స్ లో ఆక్సిజన్ అందిస్తుండగా.. మరికొందరిని వేరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు రోగుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement