Friday, May 17, 2024

శభాష్… పోలీసులే పోలీస్ స్టేషన్‌కి కన్నం వేశారట

ఎక్కడైనా దొంగలు ఇళ్లకి కన్నం వేస్తే పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి వస్తారు. కానీ పోలీస్ స్టేషన్ కే కన్నం వేస్తే… వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు. పోలీస్ స్టేషన్ కి కన్నం వేయటం ఏంటి అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ లో ఎనిమిది లక్షల రూపాయలు మాయమయ్యాయి. అయితే కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

అయితే ఆ నిందితులు ఎవరో కాదు.. అదే స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు. ఇక ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి సొమ్ము ను స్వాధీనం చేసుకున్నారు. ఇక విషయం తెలిసిన తరువాత పోలీసులే పోలీస్ స్టేషన్ లో కన్నం వేస్తే వీళ్ళు దొంగల్ని ఇంకేం పట్టుకుంటారు అంటూ మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement