Monday, May 13, 2024

TS | ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు !

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు. చాలా గ్యాప్ తర్వాత.. మళ్లీ తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.. కరీంనగర్‌ నుంచి బోయినపల్లి వినోద్‌, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌లను అభ్యర్థులుగా కేసీఆర్ ప్రకటించారు. ఇక‌, రేపు (సోమవారం) మరో నలుగురు లేదా ఐదుగురు అభ్యర్థులను బీఆర్‌ఎస్ అధిష్ఠానం ప్రకటించనున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement