Friday, May 3, 2024

ట్విట్ట‌ర్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఫాలో అవుతోన్న 5మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ -స్పందించిన జ‌న‌సేన పార్టీ

ప‌వ‌ర్ స్టార్ ,జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ 2014 ఆగస్టులో ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆయన లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. పవన్ క‌ల్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో రాజకీయపరమైన వ్యాఖ్యల కంటే, ప్రపంచ విషయాలు, పుస్తకాలు, తదితర అంశాలకు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు.కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ట్విట్ట‌ర్ లో 5మిలియ‌న్ మార్క్ కి చేరుకున్నారు. ఆయనను ట్విట్టర్ లో అనుసరించేవారి సంఖ్య 50 లక్షలకు చేరింది.కాగా ఆయన 5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న నేపథ్యంలో, జనసేన పార్టీ స్పందించింది. పవన్ ను ట్విట్టర్ లో అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించింది. పొగడ్త అయినా, సద్విమర్శ అయినా శిరోధార్యమేనని, మెరుగైన సలహాలు, సూచనలకు ఎల్లవేళలా ఆహ్వానం పలుకుతామని పేర్కొంది. మీ అభిమానం అనిర్వచనీయం, ఆనందదాయకం అని ఓ ప్రకటన వెలువరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement