Monday, April 29, 2024

Collapse – ఉత్త‌రాఖండ్ లో కుప్ప‌కూలిన ట‌న్నెల్… చిక్కుకున్న‌ 40మంది కార్మికులు

డెహ్రాడూన్‌: నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్‌లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 40 మంది దాకా కార్మికులు చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఈ ఘటన జరిగింది. చార్‌దామ్‌ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా సిల్క్‌యారా నుంచి దండల్‌గాన్‌ను కలుపుతూ నాలుగు కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మిస్తున్నారు. ఇవాళ(ఆదివారం)ఉదయం 4 గంటల ప్రాంతంలో టన్నెల్‌లోని 150 మీటర్ల పొడవున్న ఒక భాగం కుప్పకూలినట్లు పోలీసులు చెప్పారు. టన్నెల్‌ కూలిన వెంటనే జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుంది. టన్నెల్‌ కొంత భాగం ఓపెన్‌ చేసి చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటికి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈలోగా వారికి ఆక్సిజన్‌ అందించేందుకు పైప్‌ను ఏర్పాటు చేశారు. స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement