Saturday, April 27, 2024

TTD | రేపటి నుంచి తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవాలు

తిరుమలలో రేప‌టి నుంచి రెండు రోజుల పాటు (మార్చి 24, 25 తేదీల్లో) తుంబురుతీర్థ ముక్కోటి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు సంబంధించి టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. తుంబురతీర్థ ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవం సందర్భంగా పలు జాగ్రత్తలను సూచిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

ఉత్సవాల్లో భాగంగా రేపు (మార్చి 24న) ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే మార్చి 25 (సోమవారం) ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తుంబురు తీర్థ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అలాగే తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండె, శ్వాసకోశ సమస్యలు, ఊబకాయం స‌మ‌స్య‌లు ఉన్నవారికి అనుమతి లేదని టీటీడీ ప్రకటనలో పేర్కొంది. అలాగే తుంబురతీర్థ ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు వంటపాత్రలు, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement