Thursday, April 25, 2024

IPL | విశాఖ మ్యాచ్‌ల‌కు 24 నుంచి టిక్కెట్ల విక్రయం..

ఐపీఎల్‌ 17వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ నెల 31, ఏప్రిల్‌ 3 తేదీల్లో వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు గాను ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ నెల 31న చెన్నై సూపర్ కింగ్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు 27వ తేదీ నుంచి టికెట్లు కొనుక్కునే అవకాశం కల్పించారు. అదేవిధంగా ఏప్రిల్ 3న కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్ టిక్కెట్లను 24వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు. పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల అమ్మకాలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. టికెట్ల ధరలు రూ.7,500, రూ.5,000, రూ.3,500, రూ.3,000, రూ.2,500, రూ.2,000, రూ.1,500, రూ.1,000గా ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement