Thursday, April 25, 2024

TTD: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. జూలై నెల కోటాకు సంబం‌ధించిన టికెట్లను సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్‌‌లై‌న్‌లో అందు‌బా‌టులో ఉంచనుంది. కరోనా కారణంగా 2020, మార్చి 20న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో టీటీడీ ఈ నెల 1 నుంచి ఆలయంలో ప్రత్యక్షంగా భక్తులు ఆర్జిత సేవలు చేసుకునే సదుపాయాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. సుప్రభాతం, తోమాల సేవ మొదలైన అత్యంత డిమాండ్ ఉన్న ఆర్జిత సేవలను ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా భక్తులకు కేటాయించగా, కళ్యాణోత్సవం వంటి ఇతర సేవలను మొదట వచ్చిన వారికి ప్రాధాన్యత ఆధారంగా జారీ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement