Friday, May 3, 2024

నేడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నేడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ కానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో వీరి భేటీ జరగనుంది. సీఎం జగన్-జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇప్పటికే పలు సందర్భాల్లో కలుసుకున్నా ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి భేటీపై రాజకీయంగానూ చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement