Thursday, March 28, 2024

Flash: ఏపీలో మావోయిస్టుల దుశ్చర్య.. ప్రైవేట్ బస్సుకు నిప్పు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు మండలం కొత్తూరు దగ్గర ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బస్సుకు నిప్పు పెట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఆపిన మావోలు.. ప్రయాణికులను కిందికి దింపారు. అనంతరం బస్సుకు నిప్పు పెట్టారు. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బస్సుకు నిప్పు పెట్టడం అది పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సరిహద్దులో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement