Monday, April 29, 2024

అయ్యప్ప స్వాములకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. రాయితీపై శబరిమలకు ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శబరిమల వెళ్లేందుకు అయ్యప్ప స్వామి భక్తులు ప్రయివేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డ గోవర్థన్‌ ప్రకటించారు. అనుభ వుజ్ఞులైన డ్రైవర్లతో కూడిన ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. ఎలాంటి డిపాజిట్‌ లేకుండా 10శాతం రాయితీపై సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ఇద్దరు గురు స్వాములు, ఇద్దర వంట వారికి 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వములు, ఒక అటెండర్‌కు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామన్నారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్‌ చేసిన గురు స్వామికి కూడా ప్రయాణం ఉచితంగా ఇస్తామన్నారు.

ఈ ప్రత్యేక బస్సులను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి దర్శించవలసిన పుణ్యక్షేత్రాల వరకు నడపనున్నారు. టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు సీట్‌ రిజర్వేషన్‌ కోసం శబరిమల యాత్రకు కావాల్సిన ఆర్టీసీ బస్సు అద్దె బుకింగ్‌ల కొరకు సంప్రదించాలని సూచించారు. సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ 040-23450033, 69440000 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement