Sunday, April 28, 2024

టీఎస్‌ పీజీఈసెట్‌-2023 రిజిస్ట్రేషన్‌ గడువు పొడగింపు.. మే 5 వరకు దరఖాస్తుకు సమయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ పీజీఈసెట్‌-2023 రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సమర్పించే గడువు తేదీని జేఎన్‌టీయూ పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 5 వరకు దరఖాస్తుతోపాటు ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ సమర్పించుకోవచ్చని టీఎస్‌పీజీఈసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మే 5 తర్వాత ఎలాంటి పొడగింపు ఉండదని స్పష్టం చేశారు. సెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement