Monday, May 6, 2024

Video | మోదీపై ఫోన్​ విసిరేసి నిరసన.. కర్నాటకలో ప్రధానికి భద్రతా వైఫ్యలం

ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో భద్రతా వైఫల్యం బయటపడింద. ఇవ్వాల (ఆదివారం) రాత్రి జరిగిన ఓ ప్రచార యాత్రలో మోదీపైకి ఓ వ్యక్తి సెల్​ఫోన్​ విసిరేశాడు. ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓపెన్ టాప్ వాహనంపై మొబైల్ ఫోన్ విసిరివేయడంతో భద్రతా ఉల్లంఘన జరిగినట్టు తెలుస్తోంది. వాహనంపైకి సెల్​ ఫోన్​ విసిరేయగా.. దూసుకెళ్లిన ఫోన్‌కు కొన్ని అంగుళాల దూరంలోనే మోదీ ఉన్నారు. కర్నాటకలోని మైసూరులో రోడ్‌షో సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement