Sunday, April 28, 2024

TS | అమిత్ షా పర్యటనలో మార్పులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ నెల 25న ఆయన జహీరాబాద్‌కు బదులు మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో పర్యటించనున్నారు. ఈ నెల 25న 11 గంటలకు మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని సిద్ధిపేటలో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement