Monday, May 6, 2024

రోడ్డుప్రమాదంలో టీఆర్ఎస్ ఎంపీటీసీ మృతి

రోడ్డుప్రమాదంలో మహబూబ్ నగర్ జిల్లా న‌వాబ్‌పేట టీఆర్ఎస్ ఎంపీటీసీ భోగం రాధాకృష్ణ‌(38) మృతిచెందాడు. దీంతో న‌వాబ్‌పేట‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాధాకృష్ణ మృతి ప‌ట్ల టీఆర్ఎస్ నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించారు. మృతుడి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మంగ‌ళ‌వ‌రాం అర్ధరాత్రి స‌మ‌యంలో ఎంపీటీసీ రాధాకృష్ణ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణం నుంచి న‌వాబ్‌పేట‌కు వెళ్తుండ‌గా.. గ‌ద్ద‌గుండు వ‌ద్ద ఆయ‌న కారు అదుపుత‌ప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎంపీటీసీకి బ‌ల‌మైన గాయాలు కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. అర్ధ‌రాత్రి ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఎవ‌రూ గ‌మ‌నించ‌లేక‌పోయారు. ఈరోజు అటువైపు వెళ్లిన వాహ‌న‌దారులు.. ప్ర‌మాదానికి గురైన కారును గుర్తించి పోలీసుల‌కు స‌మాచారమందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement