Tuesday, April 30, 2024

కొర‌టాల శివ ఆఫీసుముందు ఆందోళ‌న‌- మా నష్టాన్ని తీర్చాల‌న్న‌ ఆచార్య ఎగ్జిబిట‌ర్లు

బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది ఆచార్య చిత్రం. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించాడు. దర్శకుడు కొరటాలకు తొలి ఓటమి రుచి చూపించింది ఈ చిత్రం. అప్పటి వ‌ర‌కు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న శివ ఒక్కసారిగా డీలా పడ్డాడు. ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆచార్య కష్టాలు కొర‌టాల శివను ఇంకా వదలడం లేదు.ఆచార్య’ సినిమాతో భారీ నష్టాలు చవిచూసిన 25 మంది ఎగ్జిబిటర్లు కొరటాల ఆఫీసు ముందు నిన్న రాత్రి నుంచి బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఈ సినిమాను కొని తాము రూ. 15 కోట్ల వరకూ నష్టపోయామని ఆ లోటులో ఎంతో కొంత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. లేదంటే చిరంజీవి ఇంటి దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ చిత్రాన్ని నిర్మాతల దగ్గర నుంచి కొరటాల శివ తీసుకున్నారట. అందుకే బయ్యర్లు నష్టాన్ని కొరటాలనే భరించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. మ‌రి ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు దారి తీస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement